పల్లవి
శ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబుఁ జేరగా ఒక్కాదరణకర్తను ఒసంగెను.
1వ చరణం
ఆ దేవునాత్మ ప్రీతిగా మదిన్ వసించుచు విధేయులైన మనల పాలించును. ||శ్రీ యేసు||
2వ చరణం
సద్గుణ మున్న మనకు ఆ యాత్మ దానము శోధించు దుష్టుని సహా జయించును. ||శ్రీ యేసు||
3వ చరణం
ఓ దేవునాత్మ, మమ్మును విశుద్ధిపర్చుము మా హృదయంబులో సదా వసించుము. ||శ్రీ యేసు||